విజయనగరంలో తెదేపా ’ప్రజాగర్జన’

tdp(1)విజయనగరంలో తెలుగు తముళ్లు గర్చించనున్నారు. ఈ సాయంత్రం 4 గంటలకు విజయనగరంలోని అమోధ్య మైదానంలో తెదేపా ప్రజాగర్జన సభ జరగనుంది. ఇప్పటికే తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు విజయ నగరం బయలుదేరారు. విమానంలో విశాఖ చేరుకుంటాడు బాబు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా విజయనగరం చేరుతారు. అయితే, విజయనగరంలో.. పెద్ద ఎత్తున నేతలు తెదేపాలో చేరే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. వీరిలో అధికులు కాంగ్రెస్ నుంచి వచ్చేవారేనట. కాగా, విశాఖ, రాజమండ్రి.. తదితర పట్టణాల్లో తెదేపా ప్రజాగర్జన సభలను నిర్వహించనుంది.