మరోవైపు విద్యుత్ సమస్యలపై గత అయిదురోజులుగా ఇందిరా పార్క్ వద్ద వామపక్షాలు చేస్తున్న దీక్షకు పోలీసులు అర్థరాత్రి భంగం కలిగించారు. వామపక్ష నాయకుల ఆరోగ్య పరిస్థితి క్షిణించడంతో.. వీరిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో దీక్ష కొనసాగించిన రాఘవులు, నారాయణ సహా ఏడుగురు వామపక్ష నేతలు అయిదురోజులుగా కొనసాస్తున్న దీక్షను ఈరోజు ఉదయం విరమించారు. ప్రభుత్వ వాణిజ్య విధానానికి స్వస్తి పలకాలని, విద్యుత్ ఉత్పత్తిలో జెన్ కోకు ప్రథమ ప్రాధాన్యమివ్వాలని నారాయణ డిమాండ్ చేశారు.
కాగా, విద్యుత్ సమస్యలపై అయిదురోజుగా నిరాహార దీక్ష చేసిన వామపక్ష నేతలు దీక్ష విరమించిన నేపథ్యంలో.. టీడీపీ అదే సమస్యపై దీక్ష చేపట్టడాన్ని వామపక్ష నాయకులు అభినందిస్తున్నారు. విద్యుత్ విషయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం అవుతున్నప్పటికిని, నిరసనలు, నిరాహార దీక్షలు కొనసాగుతున్నప్పటికిని ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.