అవిశ్వాస నోటీసు ఇచ్చిన తెదేపా!

tdpకేంద్రంపై తెదేపా అవిశ్వాస అస్త్రాన్ని ప్రయోగించింది. లోక్ సభ స్వీకర్ మీరా కుమార్ ను కలసి తెదేపా ఎంపీ మోదుగుల అవిశ్వాస నోటీస్ ను అందజేశారు. అవిశ్వాసంపై వివిధ జాతీయపార్టీల మద్ధతును కూడగట్టేందుకు సీమాంధ్ర తెదేపా నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరోవైపు, సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు కూడా ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టేందుకు రెడీ అయ్యారు. అయితే, రోజుకో నేతతో స్వీకర్ కు అవిశ్వాస నోటీసును అందజేయాలని నిర్ణయించారు. ఈరోజు ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్వీకర్ ను కలసి అవిశ్వాస నోటీసును అందజేశారు. కాగా, ఎట్టిపరిస్థితిల్లో సభను సజావుగా సాగనిచ్చేది లేదని సీమాంధ్ర కాంగ్రెస్, తెదేపా ఎంపీలు అంటున్నారు.