Site icon TeluguMirchi.com

నిరాహార దీక్ష పోయే.. మౌనదీక్ష వచ్చే..!

thalasaniవిద్యుత్ సమస్యలపై ఆందోళనను తెదేపా వివిధ రూపాలలో ప్రదర్శిస్తూనే.. ఉంది. గత నాలుగు రోజులుగా విద్యుత్ సమస్యలపై తెదేపా ఎమ్మెల్యేలు నిరవధిక నిరాహార దీక్షను ప్రభుత్వం బలవంతంగా భగ్నం చేసిన నేపథ్యంలో.. తెదేపా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో..  ఆ పార్టీ శ్రేణులు ఈరోజు (శనివారం) ఇందిరా పార్కు వద్ద మౌన దీక్షకు దిగారు. నోటికి నల్ల గుడ్డలు కట్టుకొని నిరసన తెలియజేశారు. విద్యుత్ సమస్యపై ప్రజాస్వామ్య బద్ధంగా ఆందోళన  కార్యక్రమాలు చేస్తే.. కిరణ్ ప్రభుత్వం అర్థరాత్రి అరెస్ట్ చేస్తుందని.. అయినా విద్యుత్ సమస్యలపై ప్రభుత్వం మెడలు వంచే వరకు ఉద్యమం కొనసాగుతుందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.

Exit mobile version