మరోవైపు, తెలంగాణలోనూ అభివృద్ధి మంత్రాన్నే జపిస్తోంది. తెలంగాణ పునర్ నిర్మాణం తెదేపాతోనే సాధ్యమని టీ-తెదేపా నేతలు విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తున్నారు. బలహీన వర్గాలకు సీఎం పీఠం హమీతో టీడీపీ ఎలక్షన్స్ను ఎదర్కొనడానికి సై అంటోంది. కాగా, భావసారూప్యం ఉన్న పార్టీతో పొత్తు ఉంటే తెలంగాణలో సైకిల్ జోరు ఖాయమన్న విశ్వాసంలో కార్యకర్తలున్నారు. మరీ.. తెదేపా అభివృద్ధి మంత్రం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.. !