’అభివృద్ది’యే తెదేపా మ్యానిఫెస్టో.. !!

ncbnఎన్నికల సమరానికి తెదేపా సన్నద్దమవుతుంది. అభివృద్ధి యే ప్రధాన అజెండగా ఇరు ప్రాంతాల్లో దూసుకుపోవాలని ఆ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. సీమాంధ్ర అభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని విస్తృతంగా ప్రచారం చేయనుంది. సీమాంధ్రను సింగపూర్ లా తయారు చేస్తానని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం, సమర్థ నాయక్వతమే ప్రధాన ఎజెండగా ఎన్నికల క్షేత్రంలో అమీతుమీకి తెదేపా సిద్ధమైంది.

మరోవైపు, తెలంగాణలోనూ అభివృద్ధి మంత్రాన్నే జపిస్తోంది. తెలంగాణ పునర్ నిర్మాణం తెదేపాతోనే సాధ్యమని టీ-తెదేపా నేతలు విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తున్నారు. బలహీన వర్గాలకు సీఎం పీఠం హమీతో టీడీపీ ఎలక్షన్స్‌ను ఎదర్కొనడానికి సై అంటోంది. కాగా, భావసారూప్యం ఉన్న పార్టీతో పొత్తు ఉంటే తెలంగాణలో సైకిల్‌ జోరు ఖాయమన్న విశ్వాసంలో కార్యకర్తలున్నారు. మరీ.. తెదేపా అభివృద్ధి మంత్రం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.. !