ఆయన అక్రమాలపై విచారణ జరిపించండి..!

ktrతెరాస అక్రమాస్తులపై తెదేపా పోరును ఉదృతం చేసింది. తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈరోజు (మంగళవారం) మధ్యాహ్నం క్యాంపు ఆఫీసులో సీఎం కుమార్ రెడ్డిని కలిసి కేటీఆర్ అక్రమాలపై విచారణ జరిపించాల్సిందిగా కోరారు. అయితే, ఈ వ్యవహారంఫై తెదేపా నేతలు ఇంతకుముందే రాష్ట్ర గవర్నర్ కూడా వినతిపత్రం అందజేసిన విషయం తెలిసిందే. అయితే, వైకాపాను అవినీతి, అక్రమాస్తుల కోణంలోనే ఎదుర్కొవడంలో కొంత విజయవంతమైన తెదేపా.. ప్రస్తుతం తెరాస విషయంలో కూడా అదే దారిలో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.