మరోవైపు, టీ-బిల్లును అడ్డుకోవడమే లక్ష్యంగా సీమాంధ్ర నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. వీరు కూడా రాష్ట్రపతి, ప్రధానిని కలవనున్నారు. రాష్ట్రం సమైక్యంగానే కొనసాగేలా కృషి చేస్తామని చెబుతున్నారు. మొత్తానికి తెలుగు తముళ్లు ఢిల్లీలో తమ తమ వాదనలు వినిపించడానికి రెడీ అయిపోయారు. కాగా, తెదేపా అధినేత చంద్రబాబు ఢిల్లీలో తిష్టవేసి వివిధ పార్టీ నేతలతో భేటీ అవుతూ బిజీగా వున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ కుట్రలను జాతీయ స్థాయిలో ఎండగట్టడమే లక్ష్యంగా బాబు ముందుకు కదులుతున్నారు.