కాంగ్రెస్ పై మరోసారి చంద్రబాబు నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అసమర్థపాలనతో దేశాన్ని నాశనం చేసిందని ఆయన మండిపడ్డారు. ఆ పార్టీ తప్పుడు విధానాల వల్లే రాష్ట్రం సర్వనాశనమైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనం ఖాయమని బాబు పేర్కొన్నారు.
రాబోయే ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి ఖాయమని బాబు అన్నారు. తెదేపా సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలను అభివృద్ధి చేసే బాధ్యతను తెదేపా తీసుకుంటుందని ఆయన భరోస ఇచ్చారు. కాగా, తెదేపా ఆవిర్భావ సభకు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు.