టార్గెట్ కాంగ్రెస్.. !!

target-congressరాష్ట్రంలో కాంగ్రెస్ ఖేల్ ఖతం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి మిగితా రాజకీయ పార్టీలు. తెదేపా, భాజాపా, జనసేన, లోక్ సత్తా పార్టీలు ఒకే తాటిపై నడిచి కాంగ్రెస్ భరతం పట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారమ్. ఈ మేరకు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మిగితా మూడు పార్టీలతో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. ఇప్పటికే జనసేన అధినేత పవణ్ కళ్యాణ్ బాబు తో భేటీ అయి చర్చినట్లు చెప్పుకొంటున్నారు.

’కాంగ్రెస్ హాఠావో.. దేశ్ కో బచావో’ అని పిలుపునిచ్చిన పవన్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడే ఏ పార్టీతోనైనా జతకట్టేందుకు రెడీ అని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. 4పార్టీలు ఏకమయ్యే అవకాశాలు ఎక్కవగా వున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, భాజాపా ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో పవన్ భేటీ అనంతరం పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం వుంది.

మొత్తానికి రాష్ట్రం నుండి.. కాంగ్రెస్, వైకాపాలను సాగనంపాలనే పట్టుదలతో వున్నాయి నాుగు పార్టీలు. మరీ.. వై.కాంగ్రెస్, కాంగ్రెస్ లను ఖతం చేయడానికి పవన్ యువ దమ్ము ఏ మేరకు తోడ్పతుంది. ఏపీలో కొత్త కూటమి రాజకీయ పునరేకీకరణ తీసుకొస్తుందా.. ?? తదితర ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే..