తమిళనాట బంద్ కొనసాగుతోంది. తమిళ ప్రజలంతా పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు తమిళనాడు గవర్నర్ రోశయ్యతో డీఎండీకే అధినేత విజయ్కాంత్ భేటీ అయ్యారు. జయలలిత జైలు శిక్ష పడిన అనంతర పరిస్థితులపై గవర్నర్ రోశయ్యతో చర్చించారు. తమిళనాట శాంతి భద్రతలు కాపాడాలని విజయ్ కాంత్ కోరారు..