Site icon TeluguMirchi.com

మరోసారి చర్చలు.. !

ashok babuఏపీ ఎన్జీవోలు సమ్మెను విరమింపజేసేందుకు ప్రభుత్వం శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులు సమ్మె విరమింపజేసేందుకు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం నుంచి వస్తోన్న ఒత్తిళ్ల మేరకు ముఖ్యమంత్రి ఈరోజు మరోమారు విద్యుత్ ఉద్యోలతో చర్చించనున్నారు. మరోవైపు, రెండు నెలలుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ జేఏసీతో రవాణా శాఖ మంత్రి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ చర్చలు జరపనున్నారు. రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమించాలని సీఎం, పీసీసీ ఛీఫ్ ఉద్యోగులను కోరనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఏపీ ఎన్జీవోల ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సీఎంకు ఉద్యోగుల సమ్మెను విరమింపజేసే దమ్ములేదని ఆయన వ్యతిరేక వర్గం ఆరోపిస్తుంది. మరీ ఈ సారైనా.. చర్చలు ఫలిస్తాయో లేదో వేచి చూడాలి.. !

Exit mobile version