Site icon TeluguMirchi.com

చర్చలు విఫలం – సమ్మె యథాతథం !

rtcసీమాంధ్రలో ఆర్టీసీ కార్మికుల సమ్మెను విరమింపచేయాలని పీసీసీ అధ్యక్షుడు బొత్స చేసిన మరో ప్రయత్నం విఫలమైంది. సమ్మె విరమించేందుకు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) నేతలు ససేమిరా అన్నారు. ఏపీఎన్జీవోలు సమ్మె విరమించేంతవరకు తాము సీమాంధ్రలో బస్సులు తిప్పేది లేదని వారు బొత్సకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. గత కొద్దరోజుల క్రితం కూడా బొత్స ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. కాగా, ఈయూ ఆర్టీసీని ప్రభుత్వ విభాగంగా గుర్తిస్తే సమ్మె విరమించేందుకు సిద్ధమని గతంలో ప్రకటించినప్పటికినీ తాజా చర్చల్లో ఆ దిశగా ప్రయత్నాలు గానీ, చర్చలు గానీ జరగలేదని సమాచారం.

Exit mobile version