Site icon TeluguMirchi.com

టీ-నోట్ సిద్ధం.. !

shindeరాష్ట్ర విభజన విషయంలో కేంద్రం ముందుకు వెళ్లేందుకే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రేపు కేంద్రం కేబినెట్ సమావేశం వున్న నేపథ్యంలో.. హో మంత్రి షిండే టీ-నోట్ తయారయిందని చెప్పడం విశేషం. టీ-నోట్ ని రేపు (శుక్రవారం) తాను పరిశీలిస్తానని కూడా షిండే పేర్కొన్నారు. గత పదిరోజులుగా బీజీగా వుండటం వల్ల టీ-నోట్ ని పరిశీలించేందుకు సమయం దొరకలేదని ఆయన చెప్పుకొచ్చారు. రేపు టీ-నోట్ ని పరిశీలిస్తానని షిండే అన్నారు. ఓ పక్క టీ-ప్రక్రియ అగిపోయిందని సీమాంధ్ర నేతలు చెబుతుంటే.. మరోపక్క కేంద్ర హోంమంత్రి టీ-నోట్ రెడీ అనడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, తెలంగాణ నోట్ ని రేపు జరగబోయే కేబినెట్ మీటింగ్ లో పెడతారా.. ? లేదా వచ్చే వారం జరిగే క్యాబినెట్ సమావేశంలో పెడతారా.. ? అన్నది ఆసక్తిగా మారింది. కాగా, రేపు ఉదయం 9.45 నిమిషాలకు కేబినెట్ మీటింగ్ జరగనుంది.

Exit mobile version