కేసీఆర్ తో ఎంపీల ఫాంహౌజ్ మీటింగ్ !

t-mp's-kcrతెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ముగ్గురు పార్టీని వీడేందుకు రంగం సిద్ధమవుతున్నట్లే కనిపిస్తోంది. తెరాస అధినేత కేసీఆర్ తో.. తెలంగాణ అంశంపై అధిష్టానానికి డెడ్ లైన్ విధించిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు రాజయ్య, మంద జగన్నాథం, వివేక్ లు సమావేశమయ్యారు. కేసీఆర్ ఫాంహౌజ్ జరుగుతుతున్న ఈ సమావేశానికి కె. కేశవరావు కూడా హాజరైనట్లు సమాచారం. తెలంగాణ అంశంపై ఎఐసీసీ అధికార ప్రతినిథి చాకో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. తెలంగాణ అంశాన్ని తేల్చాసిందిగా ఎంపీలు అధిష్టానానికి ఈనెల 30 వరకు డెడ్ లైన్ విధించిన సంగతి తెలిసిందే.