గవర్నర్ ను కలసిన టీ-మంత్రులు!

t-ministersమంత్రి శ్రీధర్ బాబు శాఖ మార్పుపై టీ-మంత్రులు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి వైఖరిపై అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా, రోజు ఉదయం టీ-మంత్రులు గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. మంత్రి శాఖ మార్పును గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని వారు చెబుతున్నారు. గవర్నర్ ను కలసిన వారిలో మంత్రి జానారెడ్డి, గీతారెడ్డి.. తదితరులు వున్నారు. అయితే, గతకొద్దికాలంగా.. టీ-నేతలకు ముఖ్యమంత్రిలకు మధ్య సఖ్యత చెడిదంనే చెప్పాలి. తాజా ఘటనతో.. కిరణ్ అంటేనే కస్సుమంటున్నారు టీ-నేతలు. మరీ.. టీ-నేతల ఫిర్యాదులపై అధిష్టానం స్పందిస్తుందా.. ? లేదా.. ? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.