Site icon TeluguMirchi.com

బొత్సతో భేటీయైన టీ-మంత్రులు

Botsa-Satyanarayana1రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా ఇరు ప్రాంతాల నేతలను చల్లబరిచేందుకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఈరోజు (శుక్రవారం)  పీసీపీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలంగాణ మంత్రులుతో గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. ప్రత్యేక తెలంగాణ ప్రక్రియ జరిగిందని, ఈ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసే వరకు సహకరించాలని బొత్స టీ-నేతలను కోరినట్లు సమాచారం. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్, ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ తదితరులు హాజరయ్యారు. అయితే, ఇటీవల అధిష్టానం బొత్సకు క్లాస్ పీకిన నేపథ్యంలో.. దిద్దుబాటు చర్యలో భాగంగానే.. ఆయన టీ-నేతలతో సమావేశం నిర్వహించినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version