రాష్ట్రపతిని కలవనున్న టీ-నేతలు!

telangana-Congశీతాకాల విడిదిలో వున్న రాష్ట్రపతిని కలవాలని టీ-నేతలు భావిస్తున్నారు. ఈరోజు (మంగళవారం) ఉదయం మంత్రి జానారెడ్డి నివాసంలో సమావేశమయి.. అక్కడి నుంచి నేరుగా రాష్ట్రపతిని కలిసేందుకు వెళ్లనున్నారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ముఖ్యనేతలు రాష్ట్రపతిని కలిసేందుకు వెళ్లేవారిలో వున్నారు. అయితే, తెలంగాణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని  టీ-నేతలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరనున్నారు.