అధిష్ఠానం పిలుపు మేరకు టి. కాంగ్రెస్ ముఖ్య నేతలు ఢిల్లీ బయల్దేరారు. టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్రెడ్డి, సురేష్ రెడ్డి, గీతారెడ్డి, సుఖేందర్ రెడ్డి, మధుయాష్కీ తదితరులు ఢిల్లీ బయల్దేరిన వారిలో ఉన్నారు. వీరంతా స్క్రీనింగ్ కమిటీ భేటీలో పాల్గొననున్నారు. కమిటీ ముందు ఎన్నికల అభ్యర్థిత్వాలకు సంబంధించిన అభిప్రాయాలను నేతలు చెప్పనున్నారు.