రేపటి నుంచి టి. ఐకాస దీక్ష

Kodandaramరాష్ట్ర విభజన ప్రకటన అనంతరం రాష్ట్రంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో తాము మళ్ళీ ఉద్యమబాట పట్టాల్సి వస్తోందని తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మహబూబ్ నగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రేపటి నుంచి ఈ నెల 25 వరకు హైదరాబాదు ఇందిరాపార్క్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో దీక్ష చేపడుతున్నట్టు తెలిపారు.