జనవరిలో టీ-జేఏసీ శాంతిదీక్ష!

tjacటీ-పార్లమెంట్ లో టీ-బిల్లును త్వరగా ప్రవేశపెట్టే దిశగా కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు తెలంగాణ రాజకీయ ఐకాస కార్యచరణను రూపొందించింది. దీంట్లో భాగంగానే జనవరి మొదటి వారంలో శాంతిదీక్ష నిర్వహించాలని జేఏసీ నిర్ణయించింది. అంతేకాకుండా.. రెండో దఫా అసెంబ్లీ సమావేశాలు జరిగే.. సమయంలో అంటే.. జనవరి 3నుంచి 10వరకు తెలంగాణ అంతా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీ-జేఏసీ భావిస్తోంది. ఈ మేరకు నిన్న జరిగిన జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.