Site icon TeluguMirchi.com

హేమాహేమీలు ఢమాల్ !

t cong
సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో సంచలన ఫలితాలు నమోదుయ్యాయి. తెలంగాణలో కాంగ్రెస్ పెద్దల చీటి చిరిగిపోయింది. కారు జోరుకు టీ-కాంగ్రెస్ నేతలు కొట్టుకుపోయారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో.. కీలక పాత్ర పోషించిన డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, మాజీ పీసీసీ ఛీఫ్ డీ. శ్రీనివాస రావు, ప్రజెంట్ పీసీసీ ఛీఫ్ పొన్నాల లక్షయ్య, మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మీ సునీతా రెడ్డి.. తదితరులు ఓటమి పాలైనారు. తెలంగాణ ఇచ్చామన్న కాంగ్రెస్ సెంటిమెంట్ ఎక్కడా కనిపించలేదు. తెలంగాణలో తెరాస వేవ్ స్పష్టంగా కనిపిస్తోంది.

మరోవైపు, సీమాంధ్రలోనూ కాంగ్రెస్ సీన్ లో లేకుండా పోయింది. ప్రజెంట్ పీసీసీ ఛీఫ్ రఘువీరా రెడ్డి, మాజీ పీసీసీ ఛీఫ్ బొత్స సత్యనారాయణ, దాదాపు అందరు మంత్రులు ఓటమి పాలైనారు. సీమాంధ్ర అభివృద్ధి మంత్రం, పవన్ ప్రచారం కాంగ్రెస్, వైకాపాల కొంపముంచినట్లు కనిపిస్తోంది. మొత్తంగా.. రాష్ట్రంలో కాంగ్రెస్ కు కోలుకోలేని దెబ్బ తగిలినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

Exit mobile version