Site icon TeluguMirchi.com

టీ బిల్లు ఓడిపోలేదు !

digvijay singఅసెంబ్లీ లో తెలంగాణ బిల్లుపై ఓటింగ్ జరగలేదని కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ అన్నారు. తెలంగాణ బిల్లును తిరస్కరించలేదని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన తీర్మానంపై మాత్రమే ఓటింగ్ జరిగిందని పేర్కొన్నారు. అసెంబ్లీలో రాజ్యాంగ ప్రక్రియ ముగిసిందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఓ కీలక ఘట్టం ముగిసిందని దిగ్విజయ్ చెప్పుకొచ్చారు. ఆర్టికల్-3 ప్రకారం.. కేంద్ర కేబినెట్ లో చర్చ అనంతరం పార్లమెంట్ లో బిల్లును ప్రవేశపెడతామని ఆయన తెలిపారు. పార్లమెంట్ లో బిల్లు ఆమోదం పొందుతుందన్న నమ్మకం వుందని చెప్పుకొచ్చారు.

Exit mobile version