Site icon TeluguMirchi.com

త్వరలో అసెంబ్లీకి టీ-బిల్లు : షిండే

shindeరాష్ట్ర విభజన బిల్లు సరైన సమయంలో అసెంబ్లీకి వస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. సీమాంధ్రకు ప్యాకేజీ, హైదరాబాద్.. తదితర అంశాలను బిల్లులో చేరుస్తామని షిండే పేర్కొన్నారు. కాగా, ఈ నెలాఖారు లోపు జీవోఎం పని పూర్తి చేస్తుందని చెప్పారు. మరోవైపు, ఢిల్లీలోని కేంద్ర హోంమంత్రి కార్యాలయంలో మంత్రుల బృందం (జీవోఎం) సమావేశం అయింది. హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, నారాయణ స్వామి, చిదంబరం, జైరాం రమేశ్, గులాంనబీ ఆజాద్, ఆర్పీఎన్ సింగ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. జీవోఎంకు అందిన నివేదికలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో కొన్ని కీలక అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం వున్నట్లు సమాచారం.

Exit mobile version