Site icon TeluguMirchi.com

సోనియా కోర్టులోకి ’టీ’ బంతి.. !

soniaఅటు తిరిగి, ఇటు తిరిగి బంతి అధినేత్రి సోనియా గాంధీ కోర్టులోకే వెళ్లింది. రాష్ట్ర విభజన విషయంలో.. జీవోఎం గత కొన్ని రోజులుగా తర్జనభర్జనలు పడుతున్న విషయం తెలిసిందే. రాయల తెలంగాణనా.. ? తెలంగాణనా.. ? అన్నదానిపై జీవోఎం ఓ స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోయింది. ఆఖరుకు ఎటుతేల్చలేక నిర్ణయాధికారాన్ని కేంద్ర కేబినేట్ కే కట్టబెడుతూ చేతులు దులుపుకుంది.

విభజన తుది నివేదికను క్యాబినేట్ భేటీ ముందే కొలిక్కి తీసుకురావాలని కాంగ్రెస్ కోర్ కమిటీ భావించింది. ఈ నేపథ్యంలోనే.. ఈరోజు ప్రధాని నివాసంలో సమావేశమయిన కోర్ కమిటీలో దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. అయినను.. ఓ నిర్ణయానికి రాలేకపోయింది. దీంతో.. ఈ భాధ్యతను అధినేత్రి సోనియా గాంధీకే కట్టబెట్టారు. ఈరోజు సాయంత్రం జరిగే కేంద్ర కేబినేట్ సమావేశంలో అధినేత్రి ఏ నివేదికను ఖరారు చేస్తే అది ఫైనల్ కానుంది. అధినేత్ర నివేదికను ఖరారు చేయడమే తరువాయి.. వెంటనే క్యాబినేట్ ఆమోదం పడనుందన్న మాట.

Exit mobile version