విభజన తుది నివేదికను క్యాబినేట్ భేటీ ముందే కొలిక్కి తీసుకురావాలని కాంగ్రెస్ కోర్ కమిటీ భావించింది. ఈ నేపథ్యంలోనే.. ఈరోజు ప్రధాని నివాసంలో సమావేశమయిన కోర్ కమిటీలో దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. అయినను.. ఓ నిర్ణయానికి రాలేకపోయింది. దీంతో.. ఈ భాధ్యతను అధినేత్రి సోనియా గాంధీకే కట్టబెట్టారు. ఈరోజు సాయంత్రం జరిగే కేంద్ర కేబినేట్ సమావేశంలో అధినేత్రి ఏ నివేదికను ఖరారు చేస్తే అది ఫైనల్ కానుంది. అధినేత్ర నివేదికను ఖరారు చేయడమే తరువాయి.. వెంటనే క్యాబినేట్ ఆమోదం పడనుందన్న మాట.