10న రాజ్యసభలో టీ బిల్లు !

rajyasabhaపరిస్థితులు, పరిణామాలు ఎలా వున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం టీ అంశంలో దూకుడు కొనసాగిస్తూనే వుంది. ఈ నెల 7న లోక్ సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం వున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో మరో అడుగు ముందుకేసింది. రాజ్యసభలో ఈ నెల 10న తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే ఈ మేరకు రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీకి లేఖ రాశారు.

ఇక, ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే పార్లమెంట్ లో తెలంగాణ బిల్లుతో పాటు అవినీతి నిరోధక, మత హింస నిరోధక, తదితర బిల్లులను ప్రవేశపెట్టనుంది. అయితే టీ బిల్లుపైనే ఉత్కంట నెలకొంది.