Site icon TeluguMirchi.com

ఈ రోజే ‘టీ’ పై చర్చ, ఓటింగ్ !

t bill in loksabha todayఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు చర్చ ప్రారంభమవుతుందని సమాచారం. ఈ చర్చను యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ ప్రారంభించనున్నారు. 4 గంటలపాటు చర్చ జరిగిన అనంతరం బిల్లుపై ఓటింగ్ నిర్వహిస్తారు. విభజన బిల్లును ఆమోదింపజేసేందుకు సీమాంధ్ర కేంద్రమంత్రులను, ఎంపీలను కేంద్ర ప్రభుత్వం మానసికంగా సిద్ధం చేసింది. సీమాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వటానికి అంగీకారం తెలిపినట్టు సమాచారం. మరో వైపు, లోక్ సభలో టీ చర్చ మొదలైనవెంటనే సి. ఎం కిరణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేస్తారని వినిపిస్తోంది.

Exit mobile version