మండలిలోనూ సేమ్ సీన్ !

T-BILLశాసన మండలిలోనూ టీ-బిల్లు సేమ్ సీన్ ను క్రియేట్ చేసింది. రాష్ట్రపతిపతి పంపిన టీ-బిల్లును శాసన మండలి చైర్మెన్ చక్రపాణి మండలిలో ఫ్రవేశపెట్టారు. దీంతో.. సీమాంధ్రకు చెందిన ఎమ్మెల్సీ ఆందోళనకు దిగారు. సీమాంధ్ర ఎమ్మెల్యేలు సమైక్యాంధ్ర నినాదాలు, మరోవైపు టీ-ఎమ్మ్లెల్సీలు జై తెలంగాణ నినాదాలతో మండలి దద్దర్లిపోయింది. ఆందోళన మధ్య మండలి రేపటికి వాయిదాపడింది. కాగా, ఈరోజు ఉదయం టీ-బిల్లు శాసనసభలో ప్రవేశపెట్టిన సమయంలో కూడా తీవ్ర ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే.