శాసన సభలో టీ-బిల్లు!

Telangana-bill-yet-to-reach-Andhra-Pradesh-Assemblyస్వీకర్ నాదెండ్ల మనోహర్ టీ-బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ ఉదయం గంటపాటు వాయిదా అనంతరం సభ ప్రారంభం కాగానే స్వీకర్ టీ-బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అసెంబ్లీ కార్యదర్శి సదారం బిల్లులోని అంశాలని సభలో చదివి వినిపించారు. అయితే, సభలో సభ్యుల సౌకర్యార్థం బిల్లు ప్రతులను తెలుగు, హిందీ భాషాల్లో అందుబాటు వుంచినట్లు స్వీకర్ తెలియజేశారు. శాసన సభ వెబ్ సైట్లలోకూడా బిల్లు ప్రతులను వుంచినట్లు స్వీకర్ పేర్కొన్నారు. బిల్లును సభలో ప్రవేశపెట్టిన సమయంలో.. సీమాంధ్ర నేతలు తీవ్ర నిరసనలతో సభను హోరెత్తించారు. దీంతో.. స్వీకర్ సభను అరగంటపాటు వాయిదా వేశారు.