బోగిమంటల్లో టీ-బిల్లు దగ్ధం!

apngo'sబోగిమంటల్లో టీ-బిల్లు దగ్దమైంది. ఏపీ ఏన్జీవోల పిలుపు మేరకు సమైక్యవాదులు టీ-బిల్లు ప్రతులను బోగిమంటల్లో కాల్చేస్తున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు లో నిర్వహించిన విభజన బిల్లు దగ్ధం కార్యక్రమంలో ఏపీ ఎనీవోల అధ్యక్షుడు అశోక్ బాబు పాల్గొన్నారు. టీ-బిల్లు ప్రతులను మంటల్లో వేసి నిరసన తెలిపారు. అశోక్ బాబుతో పాటుగా ఏపీ ఎన్జీవో నేతలు, ఎంపీలు మాగంటి, కొనకల్ల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, ఏపీ ఎన్జీవోల టీ-బిల్లును కాల్చేయడంపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు.