రాష్ట్ర విభజన బిల్లు రాజ్యసభ గడప తొక్కేందుకు ముహూర్తం ఖరారయింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఇక్కడ కూడా బిల్లు పాస్ అయితే, తర్వాత తుది ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపుతారు.
ఇదీలావుంటే.. రాజ్యసభలో ఈ రోజు సీమాంధ్రకు చెందిన ఎంపీలు రాష్ట్ర విభజన బిల్లుకు నిరసనగా ఆందోళన చేస్తున్నారు. వెల్లోకి దూసుకెళ్లన కేవీపీ, సుజానాచౌదరి, సీఎం రమేష్ రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.