ఎల్బీ స్టేడియం అపవిత్రమైయింది!

lb-stadum‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ పేరిట హైదరాబాదు ఎల్బీ స్టేడియంలో నిన్న ఏపీఎన్జీవోలు సమైక్య సభ నిర్వహించిన సంగతి విధితమే. అయితే, సీమాంధ్రులు తమ తెలంగాణ ప్రాంతంలో సభ జరపడంతో ఎల్బీ స్టేడియం అపవిత్రమైందంటూ తెలంగాణ న్యాయవాదుల జేఏసీ వినూత్నరీతిలో స్పందించింది. ఈ ఉదయం స్టేడియంలోని సభా వేదికను మంత్రోచ్చారణలతో పసుపు, పాలతో శుద్ధి చేసింది. ఈ సందర్భంగా న్యాయవాదులు జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.