Site icon TeluguMirchi.com

జనసేన లోకి చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు

గత కొన్నేళ్లుగా చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు గా ఉంటూ మెగా అభిమానులకు కోరికలు తీరుస్తూ , మెగా ఫ్యామిలీ లో ఓ సభ్యుడిగా మెలుగుతున్న స్వామినాయుడు..అతి త్వరలో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ లోకి చేరబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే స్వామినాయుడు అన్ని సిద్ధం చేసుకున్నాడట. అంతే కాదు భారీ ఎత్తున మెగా అభిమానులు , మెగా ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షలు మొదలగున్నవారు జనసేన పార్టీ లోకి చేరేందుకు సిద్ధం అయ్యినట్లు సమాచారం.

మెగాస్టార్ చిరంజీవితో భేటీ తర్వాతే జనసేనలోకి వెళ్లాలని స్వామినాయుడు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. స్వామినాయుడు ఇప్పటి‌వరకూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇప్పుడు జనసేన లోకి చేరబోతున్నారు. రెండు నెలల క్రితం జనసేన అంటే కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమేనని అంత అనుకున్నారు..కానీ ప్రస్తుతం చూస్తే జనసేన వెనుక సైనికులు పెరుగుతున్నారని అర్ధం అవుతుంది. ప్రస్తుతం ప్రజా పోరాట యాత్ర పేరుతో ప్రజల కష్టాలు మాత్రమే కాదు రాజకీయ నాయకుల ఆలోచనలు, వారి ప్రవర్తన కూడా పవన్ తెలుసుకుంటున్నారు. ముఖ్యం గా విశాఖ పర్యటన విషయానికి వస్తే చాల మార్పులే కనిపిస్తున్నాయి. ఇదివరకు వివిధ పార్టీల ద్వారా ప్రజలకు సేవ చేసిన నాయకులు, ఇప్పుడు జనసేన పార్టీ లోకి రావడం జరుగుతుంది.

Exit mobile version