వారికి ’ఉరే’ సరి.. !

INDIA-HEALTH-AIDS-SWARAJసామూహిక అత్యాచారానికి పాల్పడిన వారికి ఉరి తీయడమే సరైందని లోక్ సభ ప్రతిపక్ష నేత సుష్మాస్వారాజ్ పేర్కొన్నారు. ముంబాయి ఛాయచిత్ర విలేకరిపై సామూహిక అత్యాచార ఘటనపై హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటన చేశారు. ఈ సందర్భంగా సుష్మా మాట్లాడుతూ.. ఢిల్లీ, ముంబాయి లాంటి ఘటనలు భారతదేశాన్ని అపఖ్యాతి పాలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిపై సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఆమె కోరారు. కాగా, ఢిల్లీ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి చర్య తీసుకోలేదని సుష్మా ఆరోపించారు.