Site icon TeluguMirchi.com

షిండే నోట.. మళ్లీ అదే మాట.. !

shindeరాష్ట్ర విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందం భేటీ ముగిసింది. తెలంగాణ ముసాయిదా బిల్లుకు తుదిరూపు దిద్దుతారని భావించిన తెలంగాణ వాదుల ఆశల నెరవేరలేదు. దాదాపు గంటన్నరకు పైగా జరిగిన మంత్రుల బృందంలో ముసాయిదాపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోకుండా ముగిసింది. భేటీ అనంతరం.. కేంద్ర హోంశాఖ మంత్రి ఎప్పటిలాగే.. సాధ్యమైనంత త్వరగా తెలంగాణ ప్రక్రియను పూర్తిచేస్తామని స్టేట్ మెంట్ ఇచ్చేశారు. అయితే, విదేశాల్లో ఉండటం వల్ల ఆర్థిక మంత్రి చిదంబరం, అనివార్య కారణాల వల్ల ఆరోగ్య శాఖ మంత్రి గులాంనబీ ఆజాద్ ఈ సమావేశానికి హాజరు కాలేకపోయారని షిండే తెలిపారు. వచ్చే వారం మరోసారి సమావేశం కానున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Exit mobile version