ముఖేష్ ‘జెడ్ భద్రత’ను ప్రశ్నించిన సుప్రీం !

SUPREME-COUTప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి జడ్ కేటగిరి భద్రతపై దేశ సర్వోత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. విఐపీలకు జెడ్ భద్రతను కల్పించే ప్రభుత్వం సాధారణ మానవునికి మాత్రం ఎందుకు భద్రత కల్పించలేకపోతోందని న్యాయస్థానం కేంద్రాన్ని ప్రశ్నించింది. తగిన భద్రతను ప్రభుత్వం కల్పించినట్లయితే ఇటీవల దేశ రాజధానిలో చోటుచేసుకున్న అయిదు సంవత్సరాల బాలిక అత్యాచారం జరిగి ఉండేది కాదని సుప్రీం అభిప్రాయపడింది. కాగా, ఇటీవలే ముఖేష్ అంబానీకి జడ్ కేటగిరి భద్రత కల్పిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.