టీ బిల్లు పై 8న సుప్రీం కోర్టులో విచారణ

scరాష్ట్ర విభజన బిల్లును పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టకుండా అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజిత వ్యాజ్యాన్ని విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. పిల్ ను ఈ నెల 8న విచారించనున్నట్టు చీఫ్ జస్టిస్ సదాశివంతో కూడా ధర్మాసనం తెలిపింది. రాష్ట్ర విభజన నిలిపి వేయాలంటూ సుప్రీంకోర్టులో ఏకంగా ఏడు పిటిషన్లు దాఖలయ్యాయి. వివిధ పార్టీలకు చెందిన నేతలతో పాటు పలు స్వచ్చంధ సంస్థలు ఈ పిటిషన్లు దాఖలు చేశాయి.