12న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం..!

cm kiranఈ నెల 12న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. తెలంగాణ విషయంలో త్వరలోనే ముఖ్యనేతలందరు రోడ్ మ్యాప్ లతో ఢిల్లీ పర్యటన వెళ్లనున్న నేపథ్యంలో.. ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. మొదట సమావేశాన్ని 12వ తేది సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తామని అనుకొన్నా.. సాయంత్రం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లాల్సి వుండటంతో.. ఆరోజు ఉదయం 11 గంటలకు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ నెల 12న తేదిన కేంద్ర కోర్ కమిటీ సమావేశం అయ్యే అవకాశాలున్నట్లు వార్తలొస్తున్న విషయం తెలిసిందే.