’విభజన సమాచారం’ రెడీ చేయండి : సీఎస్

mahanthiరాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో చర్చల రచ్చ కొనసాగుతూనే వుంది. మరోవైపు విభజనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని రెడీ చేయడంలో మునిగిపోయారు ప్రభుత్వ ఉన్నతాధికారులు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి బుధవారం సచివాలయంలో 20 ప్రధాన శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర పునర్విభజన బిల్లులోని షెడ్యూళ్లను లోతుగా పరిశీలించి.. దానికి సంబంధించిన సమాచారాన్ని రెడీ చేయాలని మహంతి అధికారులను ఆదేశించారు. టీ-బిల్లుపై చర్చించేందుకు సరైన సమాచారం లేదని లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణతో పాటుగా పలువురు నేతలు అభిప్రాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే… విభజనకు సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని సేకరించే పనిలో వున్నారు మన ఉన్నతాధికారులు.