Site icon TeluguMirchi.com

రేపు రాష్ట్ర బంద్!!

state bandhటీ-బిల్లుపై రేపటి నుంచి అసెంబ్లీలో చర్చ నేపథ్యంలో.. సమైక్యవాదులు నిరసన కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే ఏపీ ఎన్జీవోలు రేపు (జనవరి3) రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, వైకాపా కూడా రేపు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. వైకాపా అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం సమావేశమైన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర పునర్విభజన బిల్లుపై అసెంబ్లీ అభిప్రాయాన్ని కోరుతూ..  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి వర్తమానాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపిన విధానానికి తీవ్రంగా నిరసనగా వైకాపా బంద్ కు పిలుపునిస్తున్నట్లు ఆ పార్టీ నేత వైసూర రెడ్డి తెలిపారు. అంతేకాకుండా..  4న మోటారు సైకిళ్ల ర్యాలీ, 6న మానవహారాలు, 7 నుంచి 10 వరకు తాలూకా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని వైకాపా నిర్ణయించింది.

Exit mobile version