Site icon TeluguMirchi.com

శ్రీలక్ష్మికి బెయిల్ మంజూరు

srilaxmiఓఎంసీ కేసులో నిందితురాలైన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి ఈరోజు (శనివారం) కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో పూర్తిస్థాయిలో బెయిల్ మంజూరు చేయవలసిందిగా శ్రీలక్ష్మి  చేసిన విజ్జప్తిని కోర్టు తిరస్కరించింది. అయితే అనుమతి లేకుండా హైదరాబాద్ నగరాన్ని విడిచి వెళ్లరాదని, సిబిఐ దర్యాప్తులో జోక్యం చేసుకోరాదని కోర్టు ఆదేశించింది. దీంతో పాటు రెండు లక్షల రూపాయలు మరియు ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుకు కూడా కోర్టు ఆదేశించింది. కాగా, శ్రీలక్ష్మి ఆరోగ్యపరిస్థితి ఏమీ బాగోలేదని ఉస్మానియా ఆస్పత్రి వర్గాలు ఈ నెల ౨౧న వెల్లడించిన నేపథ్యంలో.. కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయవలసిన అవసరం ఏర్పడిందని తెలుస్తోంది. శ్రీలక్ష్మికి ఎడమ కాలి జాయింట్ల వద్ద, వెన్ను ఆపరేషన్ జరిగిన చోట కండరాల నొప్పి తీవ్రంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు.

Exit mobile version