Site icon TeluguMirchi.com

బీఏసీ సమావేశం ఏర్పాటు చేసిన స్వీకర్!

nadendla-manaoharఅసెంబ్లీలో ఈరోజు కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. శాసనసభ ప్రారంభం కాగానే సీమాంధ్ర నేతలు జై సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మాణాలను స్వీకర్ తిరస్కరించారు. అనంతరం ఆందోళనల మధ్య స్వీకర్ బీఏసీ సమావేశంపై ప్రకటన చేశారు. బీఏసీ సమావేశం తరవాతే మళ్లీ సభ సమావేశం కానుంది. బీఏసీ సమావేశంపై ప్రకటన అనంతరం సభ వాయిదా పడింది. కాగా, సమైక్యాంధ్ర, తెలంగాణ ఉద్యమాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై చర్చ కోరుతూ టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది… అలాగే తెలంగాణ ముసాయిదా బిల్లుపై వెంటనే చర్చ ప్రారంభించాలంటూ సీపీఐ వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది, సమైక్య తీర్మానం చేయాలంటూ వైసీపీ వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. మరోవైపు శాసన మండలి బీఏసీ సమావేశం ప్రస్తుతం కొనసాగుతోంది. ఆనారోగ్యం కారణంగా నిన్న సమావేశాలకు దూరంగా వున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు సభకు హాజరయ్యారు.

Exit mobile version