సోనియా డౌన్ డౌన్ !

sonia‘సోనియా గాంధీ డౌన్ డౌన్’ నినాదాలతో అసెంబ్లీ దద్దరిల్లింది. సోనియా డౌన్ డౌన్ అంటూ అసెంబ్లీలో సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెలంగాణ విభజన బిల్లుపై తెలుగుదేశం సభ్యుడు పల్లె రఘునాదరెడ్డి మాట్లాడుతూ … సోనియాగాందీ తన కుమారుడు రాహుల్ గాందీ ని ప్రధానిని చేయడం కోసం తెలంగాణ ఇచ్చారని ఆరోపించారు. దీంతో కాంగ్రెస్ సభ్యలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో లేనివారి గురించి మాట్లాడడం సరికాదని మంత్రులు కొండ్రు మురళి, శైలజానాథ్, జానారెడ్డి అన్నారు. సోనియాను నిందిచడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే దోణ్రంరాజు శ్రీనివాస్ అన్నారు. సోనియా,రాహుల్ లు త్యాగానికి ప్రతీక అని అన్నారు. వారిని అంటే ఊరుకోబోమని అన్నారు. ఇదే సమయంలో టిడిపి సభ్యులు పోడియంలో నిలబడి సోనియా గాందీ డౌన్ ,డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క సభను 10 నిమిషాలు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో అదే సీన్ కొనసాగింది.