మహాబోధిని సందర్శించిన ఆ ఇద్దరు..!

mahabhodhiకాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే ఈరోజు (బుధవారం) బుద్ధగయలోని మహాబోధి ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఇటీవలే ఈ ఆలయంలో వరుస బాంబు పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. అధినేత్రి సోనియాతో కలసి షిండే ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తును కేంద్ర ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఎ)కు అప్పగించింది. కాగా, మహా బోధి ఆలయంలో వరుస పేలుళ్లు తమ పనేనని ఇండియన్ మజాహిద్దీన్ ప్రకటించినట్లు తెలుస్తోంది.