Site icon TeluguMirchi.com

నిర్ణయం జరిగిపోయింది.. ఇక వెనక్కి వెళ్లలేము !

SONIA-GANDHI (2)‘తెలంగాణపై నిర్ణయం జరిగిపోయింది… ఇక వెనక్కి వెళ్లలేమని’ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు చివరి ప్రయత్నంగా సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు చిరంజీవి, కనుమూరి బాపిరాజు.. తదితరులు అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమయ్యారు. అయితే, ఈ సమావేశంలో నేతలు చెప్పిన విషయాలన్నింటిని కూడా సావధానంగా విన్న అధినేత్రి.. ఇప్పటికే తెలంగాణపై నిర్ణయం అయిపోయిందని.. ఇక వెనక్కి వెళ్లలేమని స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే, ఈ ఒక్కరోజుతో ఏమీ అయిపోదు.. మీ ప్రాంతానికి అన్యాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని కూడా సోనియా అన్నట్లు తెలుస్తుంది.

Exit mobile version