Site icon TeluguMirchi.com

ముజఫర్‌ లో పర్యటించిన ఆ ముగ్గురూ.. !

Manmohan-Rahul-and-Soniaఇటీవలే అల్లర్లు జరిగిన ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈరోజు పర్యటించారు. అల్లర్లు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి, బాధితులను పరామర్శించారు. ముగ్గురు ప్రముఖులు ఒకేసారి ముజఫర్ కు రావడంతో.. ప్రభుత్వం భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ముజఫర్ అల్లర్లకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విషయంలో యూపీ ప్రభుత్వానికి అన్ని విధాలా సాయం అందిస్తామని ప్రధాని పేర్కొన్నారు. కాగా, ముజఫర్ అల్లర్లలో 40మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే.

Exit mobile version