Site icon TeluguMirchi.com

టీ-కాంగ్రెస్ ఎంపీలకు సోనియా అక్షింతలు !

t-mp's-agitation-on-telangaటీ-ఎంపీలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ క్లాస్ పీకారు. పార్లమెంట్ రెండో విడత సమావేశాలు ప్రారంభమైన మొదటిరోజు నుండే.. తెలంగాణ బిల్లును సభలో ప్రవేశపెట్టాలంటూ టీ-కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అయితే.. సభ ప్రారంభం కాగానే టీ-కాంగ్రెస్ ఎంపీలు నిన్నటిలానే ఈ రోజు కూడా సభలో నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహించిన అధినేత్రి సోనియా గాంధీ సంయమనం పాటించాలని, మెదలకుండా కూర్చోవాలని కాస్త గట్టిగానే ఎంపీలకు సూచించినట్లు తెలుస్తోంది.

తాజాగా ఢిల్లీలో చోటుచేసుకున్న చిన్నారి అత్యాచారం, కోల్ స్కాం.. తదితర అంశాలపై ప్రతిపక్షాలు మూకుమ్మడి దాడితో.. సతమతమవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి టీ-ఎంపీల సొంతింటి పోరు ఎక్కువైందని భావించిన సోనియా.. గట్టిగానే క్లాస్ పీకినట్లు సమాచారం. అయితే అధినేత్రి ఆదేశంతో.. టీ-కాంగ్రెస్ ఎంపీలు ఎప్పటిలాగే.. పిల్లిలా కిమ్మనకుండా ఉంటారా.. లేదా అమ్మ ఆదేశాన్ని ఎదురించి పులిలా గాడ్రిస్తారా చూడాలి మరి!

Exit mobile version