సోనియాతో సమావేశమయిన దిగ్విజయ్ !

sonija-digvijayకాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తో రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఈరోజు ఉదయం ఆమె నివాసంలో సమావేశమయ్యారు. తాజాగా, రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయపరిణామాలపై  ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల దిగ్విజయ్ రాష్ట్రంలో పర్యటించిన సందర్భంగా..  తెలంగాణ అంశంపై ఆయనతో  ఇరు ప్రాంత నేతలు చేసిన విజ్ఞప్తిని అధినేత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అంతేకాకుండా… ఈ సమావేశంలో దిగ్విజయ్ చెప్పిన అంశాలే మరో వారంలో నిర్వహించే కాంగ్రెస్ కోర్ కమీటిలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకుల్ భావిస్తున్నారు. అయితే, కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ తేల్చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో.. నేతల భేటీలు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయనడంలో సందేహం లేదు.