Site icon TeluguMirchi.com

‘నాటకం’ అని తేలిపోయింది: సోమిరెడ్డి

కాంగ్రెస్, వైఎస్సార్ సీపీలు కలిసి నాటకాలు ఆడుతున్నాయని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ నేతల సతీమణులు రాష్ట్రపతిని కలవడం ద్వారా ఆ రెండు పార్టీలు ఒక్కటే అనడానికి నిదర్శనమని అన్నారు. సోమయాజులు, ఉదయభానుల సతీమణులు భర్తలకు తెలియకుండానే రాష్ట్రపతి వద్దకు కాంగ్రెస్ నేతల భార్యలతో కలసి వెళ్లారా? అని ప్రశ్నించారు. దీనిపై ఆ రెండు పార్టీలు సమాధానం చెప్పాలని సోమిరెడ్డిడిమాండ్ చేశారు.

Exit mobile version