జగన్ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు అయ్యారనేందుకు మొయిలీ, దిగ్విజయ్, చాకో వ్యాఖ్యలే నిదర్శనమని అన్నారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈ రోజు ఎన్టీఆర్ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన జగన్ పై మండిపడ్డారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్న 65రోజుల తర్వాత జగన్ మాట్లాడడంపై సోమిరెడ్డి సందేహాలు వ్యక్తం చేశారు. జగన్ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు.ఇక రాష్ట్ర విభజనకు బొత్స శకుని పాత్ర పోషించారని, బొత్స దోపిడీ ని తట్టుకోలేక విజయనగరంలో ప్రజలు తిరగబడుతున్నరన్నారని అన్నారు.